తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అత్తింటి వేధింపులు తాళలేక బాలింత ఆత్మహత్య

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తానూరు మండలం దౌలాతాబాలో జరిగింది. గ్రామానికి చెందిన శోభ మనస్తాపంతో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

By

Published : Sep 8, 2020, 7:10 AM IST

అత్తింటి వేధింపులు తాళలేక బాలింత ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తాళలేక బాలింత ఆత్మహత్య

నిర్మల్​ జిల్లా తానూరు మండలం దౌలతబాద్​లో దారుణం జరిగింది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ బాలింత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శోభ మనస్తాపంతో వ్యవసాయ బాలిలో దూకి మృత్యువాతపడింది. ఆమె మృతితో నాలుగు నెలల బాలుడు తల్లిలేనివాడయ్యాడు. అత్తింటి వారు వేధించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మబాద్​కు చెందిన శంకర్ మూడో కుమార్తె అయిన శోభను దౌలతబాద్​కు చెందిన దిగంబర్​కిచ్చి రెండేళ్ల కిందట వివాహం చేశారు. ఏడాది పాటు బాగానే ఉన్నా.. తర్వాత తమ బిడ్డని చిత్ర హింసలు పెట్టేవారని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతితో నాలుగు నెలల పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details