తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ కూతుళ్ల ధర్నా

ప్రాణం నిలిపే వారిని వైద్యులని అంటారు. ఎలాంటి వారైనా ఆపద కాలంలో వైద్యుడికి చేతులెత్తి మొక్కుతారు. అంతటి పవిత్ర వృత్తిలో ఉన్న కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాగే నిర్లక్ష్యపు వైద్యంతో తమ తండ్రి ప్రాణాలు తీశారని ఇద్దరు కూతుళ్లు హైదరాబాద్​లో ఓ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

By

Published : Mar 25, 2019, 2:45 PM IST

తండ్రి మృతిపై న్యాయపోరాటానికి దిగిన కుమార్తెలు

తండ్రి మృతిపై న్యాయపోరాటానికి దిగిన కుమార్తెలు
హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని రోడ్ నంబరు 12లో ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెంకు చెందిన సంగీతరావు అనే వ్యక్తి కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల14న సింగరేణి ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్​లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. గత శనివారం రాత్రి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆదివారం వ్యాధి తీవ్రత ఎక్కువై రోగి మృతిచెందాడని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

డబ్బుల కోసం ఇంతదాష్టీకానికి ఒడిగడతారా..!

అప్పటి వరకూ తమ తండ్రి బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చిన వైద్యులు.. మరుక్షణంలోనే చనిపోయాడని చెప్పడం విని కుటుంబసభ్యులు నిర్ఘాంత పోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని సంగీతరావు కుమార్తెలు జెస్సీ, బిన్నీ ఆరోపించారు. డబ్బుల కోసం సినీఫక్కీలో నాటకమాడి కనీసం తమని చూడటానికి కూడా అనుమతించలేదని వాపోయారు. డబ్బంతా కట్టించుకున్న తరువాత తమ తండ్రి చనిపోయిన విషయం చెప్పారని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తమకు ఎలాంటి సమాచారం లేకుండా మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారని నిరసించారు.

న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం

పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోగా.. ఎస్సై తమతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని విలపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

నచ్చచెప్పిన పోలీసులు

ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మృతదేహాన్ని తరలించామని ఏసీపీ తిరుపతన్న తెలిపారు. తమ సిబ్బంది బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదన్నారు.

ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేశారు.

ఇదీ చదవండి:యాదాద్రి జిల్లాలో అనుమానాస్పదంగా యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details