తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2020, 3:47 PM IST

ETV Bharat / jagte-raho

అక్రమంగా బ్లాస్ట్‌ చేశాడు.. ప్రాణాలు వదిలాడు

యాదాద్రి జిల్లా పెద్దపలుగు తండాలో అక్రమంగా బ్లాస్టింగ్‌ చేసిన వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని పోచంపల్లి మండలం గోసుకొండ గ్రామానికి చెందిన బలరాం ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ చేశాడు. ఈక్రమంలోనే బ్లాస్టింగ్‌ రాళ్లు తలకు తగిలాయి.

అక్రమంగా బ్లాస్ట్‌ చేశాడు.. ప్రాణాలు వదిలాడు
అక్రమంగా బ్లాస్ట్‌ చేశాడు.. ప్రాణాలు వదిలాడు

అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పెద్దపలుగు తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో పెద్దపలుగు తండాలోని మోతిలాల్ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్న వరికుప్పల బలరాం అనే వ్యక్తికి బ్లాస్టింగ్ రాళ్లు తలకు తగిలాయి.

దీంతో మంగళవారం అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజున మృతి చెందాడు. బలరాం స్వస్థలం పోచంపల్లి మండలం గోసుకొండ గ్రామం . అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌ పనులు చేయడం నేరమని బీబీనగర్‌ ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: బ్లాస్టింగ్ వార్తకు స్పందించిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details