అత్తా కోడళ్ల ఘర్షణ ఓ చిన్నారి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లికి చెందిన ఓ ఇల్లాలు ఇంట్లో తన అత్తతో గొడవకు దిగింది. అత్తా కోడళ్లు మాటా మాటా అనుకుంటూ.. అత్త చేతిలో ఉన్న తన తొమ్మిది నెలల చిన్నారిని కోడలు కోపంగా తీసుకుని కింద పడేసింది.
దీంతో చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం కోస్గిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు.