జవహర్నగర్ ఇన్స్పెక్టర్ బిక్షపతిరావుపై దాడి ఘటనలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న జవహర్నగర్లోని సర్వే నెంబర్ 432లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. మున్సిపల్ అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన సీఐ బిక్షపతిరావుతోపాటు.. ఇతర పోలీసు సిబ్బందిపై పూనమ్ చంద్తోపాటు అతని కుటుంబ సభ్యులు కళ్లల్లో కారం చల్లుతూ దాడికి పాల్పడ్డారు.
సీఐపై దాడి ఘటనలో 16 మంది అరెస్టు
జవహర్నగర్ ఇన్స్పెక్టర్ బిక్షపతిరావుపై దాడి ఘటనలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న జవహర్నగర్లోని సర్వే నెంబర్ 432లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన సీఐపై స్థానికులు దాడికి దిగారు.
సీఐపై దాడి ఘటనలో 16 మంది అరెస్టు
ఆ ఘటనలో సీఐ బిక్షపతిరావు 40 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చూడండి :14 ఫేక్ రుణాల యాప్లు.. అదుపులో నిందితులు