ఇరాక్ కిర్కుక్లోని అమెరికా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి క్షిపణి దాడులు జరిగినట్లు ప్రకటన విడుదల చేశాయి ఇరుదేశాల భద్రతా దళాలు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
2019 డిసెంబరు 27 నాటి దాడుల అనంతరం అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు జరగడం ఇదే తొలిసారి . అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మృతికి కారణమైన నాటి ఘటన కతెబ్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థ నిర్వహించిందేనని ఆరోపించింది అమెరికా.