తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2023, 12:23 PM IST

ETV Bharat / international

భారత్​పైనా చైనా బెలూన్ల నిఘా.. మిలిటరీ డేటా చోరీ! ఎన్నో ఏళ్ల నుంచి..

చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేయటంపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉండగా మరో సంచలన విషయం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనా నిఘా బెలూన్‌ను ఆ దేశ మిలిటరీ కూల్చివేసిన కొద్ది రోజులకే మరో విస్తుపోయే విషయాన్ని అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడించింది. భారత్‌, జపాన్‌ సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచారి బెలూన్‌లను ప్రయోగించిందని తెలిపింది.

Chinese spy balloons have targeted several countries including India
Chinese spy balloons have targeted several countries including India

చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్‌లో అనేక సంవత్సరాలుగా పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పనిచేస్తోందని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌ సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక దేశాల సైనిక ఆస్తుల సమాచారాన్ని ఈ వ్యవస్థ సేకరించిందని పేర్కొంది. ఈ నివేదిక అనేక మార్గాలు, నిఘా అధికారుల ద్వారా సేకరించినట్లు వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం ద్వారా నిర్వహిస్తున్న ఈ నిఘా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు.

అమెరికా నేవీ విడుదల చేసిన చిత్రాలు

పీపుల్స్ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా సముదాయానికి చెందిన నిఘా బెలూన్లు.. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని ఉన్నతాధికారులు తెలిపారు. గత వారం కనిపించిన బెలూన్‌ కాకుండా.. కొన్నేళ్లుగా కనీసం నాలుగు బెలూన్లు హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్​లో ప్రత్యక్షమయ్యాయని ది డైలీ తెలిపింది. ట్రంప్‌ హయాంలో మూడు నాలుగు సందర్భాల్లో ఇలాంటివే జరిగినా.. ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్‌షిప్‌లుగా గుర్తించినట్లు ప్రకటించింది. కాగా, ఇటీవల తమ గగనతలంలో తిరిగిన చైనా నిఘా బెలూన్​ను అమెరికా ఇటీవలే కూల్చివేసింది. వాటి శిథిలాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను అమెరికా నేవీ విడుదల చేసింది.

అమెరికా నేవీ విడుదల చేసిన చిత్రాలు

ABOUT THE AUTHOR

...view details