ఇంగ్లాండ్ రీడింగ్ నగరంలోని ఓ పార్కులోకి చొరబడి ముగ్గురు అమాయకులను అత్యంత దారుణంగా పొడిచి చంపింది, అనేక మందిని తీవ్రంగా గాయపరిచింది ఉగ్రవాదులేనని తేలింది. ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు, థేమ్స్ వ్యాలీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం బయటపడింది.
ఉగ్రవాద నిరోధక విభాగం దర్యాప్తు ఉగ్ర కలకలం..
రద్దీగా, ప్రశాంతంగా ఉన్న రీడింగ్ పార్క్లో ఉగ్రవాదుల కత్తుల దాడి ఒక్కసారిగా కలకలం రేపింది. భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా అరుస్తూ పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రజలను ఇళ్లల్లోకి పంపారు. ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.
ఉత్తర ఆఫ్రికా లిబియాకు చెందిన ఆ యువకుడిని విచారించగా ఇది ఉగ్ర కుట్ర అని తేలింది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు వ్యతిరేకంగా సాగుతున్న 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్' నిరసనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పోలీసులు. దీంతో.. రీడింగ్ నగరానికి ఉగ్రవాద ముప్పుందని గ్రహించి ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు.
సంఘటనా స్థలంలో పోలీసు వాహనాలు, అంబులెన్సులు ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, హోం మంత్రి ప్రీతి పటేల్, ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యంకాక్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పోలీసుల స్పందించిన తీరును ప్రశంసించారు. ఘటనా స్థలానికి దక్షిణ మధ్య అంబులెన్స్ సేవలు, ఐదు ప్రత్యేక వైద్య బృందాలు, ఓ హెలికాప్టర్ను పంపించినట్లు వెల్లడించింది ఆ దేశ ఆరోగ్య శాఖ.
రంగంలోకి అత్యవసర స్పందన దళం ఇదీ చదవండి:పార్టీలో ఫైరింగ్- 9 మందికి గాయాలు