జర్మనీ ఫార్మ కంపెనీ బయోఎన్టెక్- అమెరికా ఔషధ సంస్థ ఫైజర్లు తమ కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి గురైనట్లు వెల్లడించాయి. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ)పై జరిగిన సైబర్ దాడిలో వ్యాక్సిన్కు సంబంధించిన డేటాకు హ్యాకర్లు యాక్సెస్ పొందినట్టు తెలిపాయి.
ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో కరోనా వ్యాక్సిన్కు షరతులతో కూడిన మార్కెటింగ్కు అనుమతినిచ్చే విషయాన్ని ఈఎంఏ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబర్ దాడి జరిగినట్లు తెలిసింది.సైబర్ దాడిపై పూర్తి వివరాలు చెప్పేందుకు మాత్రం ఈఎంఏ నిరాకరించింది.