తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2020, 9:30 AM IST

ETV Bharat / international

సైబర్ దాడిలో ఫైజర్ టీకా డేటా హ్యాక్!

తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి గురైనట్లు ఫైజర్​- బయోఎన్​టెక్​లు ప్రకటించాయి. యురోపియన్​ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ)పై జరిగిన సైబర్ దాడిలో హ్యాకర్లు ఈ డేటాను యాక్సెస్ చేయగలిగినట్లు వెల్లడించాయి.

Corona Vaccine data leak in Cyber attack
ఫైజర్ టీకీ డేటా లీక్

జర్మనీ ఫార్మ కంపెనీ బయోఎన్​టెక్- అమెరికా ఔషధ సంస్థ ఫైజర్​లు తమ కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి గురైనట్లు వెల్లడించాయి. యురోపియన్​ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ)పై జరిగిన సైబర్ దాడిలో వ్యాక్సిన్​కు సంబంధించిన డేటాకు హ్యాకర్లు యాక్సెస్ పొందినట్టు తెలిపాయి.

ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో కరోనా వ్యాక్సిన్​కు షరతులతో కూడిన మార్కెటింగ్​కు అనుమతినిచ్చే విషయాన్ని ఈఎంఏ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబర్​ దాడి జరిగినట్లు తెలిసింది.సైబర్ దాడిపై పూర్తి వివరాలు చెప్పేందుకు మాత్రం ఈఎంఏ నిరాకరించింది.

తమ సిస్టమ్స్​పై మాత్రం ఎలాంటి సైబర్ దాడి జరగలేదని ఫైజర్​, బయోఎన్​టెక్​లు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి:ఫైజర్ టీకా​కు కెనడా ఆమోదం

ABOUT THE AUTHOR

...view details