పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు అక్కడి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన రాజద్రోహం కేసులో ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ పాక్ సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన అప్పీలును తిరస్కరించింది న్యాయస్థానం. కోర్టు ఎదుట హాజరైతేనే అప్పీలు విచారణను స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్ సమాధానమిచ్చినట్లు డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. పిటిషన్ తిరస్కరణపై కోర్టు రిజిస్ట్రార్ నిర్ణయాన్ని ముషారఫ్ తరఫు న్యాయవాదుల కౌన్సిల్ అప్పీలు చేయనున్నట్లు తెలుస్తోంది.