ఫేస్బుక్ సామాజిక మాధ్యమంలో తానే రారాజునని మరోసారి చాటారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 'ఫేస్బుక్లో ప్రపంచ నేతలు-2020' పేరుతో బర్సన్ కోహన్ అండ్ ఒల్ఫ్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో నాలుగు కోట్ల యాభై లక్షల లైకులతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. రెండు కోట్ల డెబ్భై లక్షల లైకులతో రెండో స్థానంలో నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కోటీ అరవై లక్షల ఎనభై వేల లైకులతో జోర్డాన్ మహారాణి రనియా మూడో స్థానంలో నిలిచారు.
అభిమానుల్లోనూ మోదీ హవా..
ఫేస్బుక్ ఫ్యాన్ ఫాలోయింగ్లో కూడా మోదీనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు సామాజిక మాధ్యమంలో పదిహేడు లక్షలమంది అభిమానులు ఉన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు 9,56,000.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు 8,77,000 మంది అభిమానులు ఉన్నట్లు సమాచారం.