తెలంగాణ

telangana

ETV Bharat / international

కుల్​భూషణ్​ జాదవ్​​ను కలిసిన భారత దౌత్యాధికారి

పాకిస్థాన్ చెరలో ఉన్న నావికాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​తో భారత దౌత్యాధికారి సమావేశమయ్యారు. అంతర్జాతీయ న్యాయస్థాన ఆదేశాల మేరకు భారత అధికారులు జాదవ్​తో కలిసేందుకు పాక్ అనుమతించింది. దాయాది ప్రకటనను స్వాగతించిన భారత్ మాజీ నావికాదళ అధికారితో భేటీకి దౌత్యాధికారి గౌరవ్ అహ్లువాలియాను పంపింది. 2017 అనంతరం భారత అధికారులు కుల్​భూషణ్​తో సమావేశం కావడం ఇదే తొలిసారి.

By

Published : Sep 2, 2019, 12:04 PM IST

Updated : Sep 29, 2019, 3:56 AM IST

కుల్​భూషణ్​జాదవ్​​ను కలిసిన భారత దౌత్యాధికారి

నావికాదళ మాజీ అధికారి కుల్​భూషణ్ జాదవ్​తో పాకిస్థాన్​లో భారత దౌత్య వ్యవహారాల ఇన్​ఛార్జి గౌరవ్ అహ్లువాలియా ర్వాల్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు దౌత్యవేత్తలతో సమావేశానికి పాకిస్థాన్ అనుమతించింది.

అంతకుముందు జాదవ్​తో భారత అధికారుల భేటీకి అనుమతిస్తూ పాక్ చేసిన ప్రకటనను స్వాగతించిన భారత్... స్వేచ్ఛాపూర్వక సమావేశానికి దాయాది అవకాశం కల్పిస్తుందని ఆకాంక్షించింది.

"అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరించి... స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో కుల్​భూషణ్​తో సమావేశమయ్యేలా పాకిస్థాన్ అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నాం."

-భారత అధికారులు

ఇరాన్​లో వ్యాపారం నిర్వహిస్తుండగా 2016లో పాక్​ ఏజెంట్లు కుల్​భూషణ్​ను అపహరించారు. ఆ తర్వాత పాక్​లోకి ప్రవేశిస్తుండగా బలూచిస్థాన్​లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.గూఢచర్యం, పాక్ వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో 2017లో పాకిస్థానీ సైనిక కోర్టు జాదవ్​కు మరణశిక్ష విధించింది. శిక్షపై స్టే విధించాలని... తదుపరి కార్యాచరణ చేప్టటాలని కోరుతూ ది హేగ్​లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. మరణశిక్ష నిర్ణయంపై పునఃసమీక్షించాలని పాకిస్థాన్​ను కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ

Last Updated : Sep 29, 2019, 3:56 AM IST

ABOUT THE AUTHOR

...view details