తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​: మెట్రో స్టేషన్​కు నిప్పు పెట్టిన నిరసనకారులు

నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో 13 వారాల నుంచి జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాంగ్​కుక్ మెట్రో స్టేషన్​కు నిరసనకారులు నిప్పుపెట్టగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

By

Published : Sep 1, 2019, 9:38 AM IST

Updated : Sep 29, 2019, 1:17 AM IST

హాంకాంగ్​: మెట్రో స్టేషన్​లో నిప్పు పెట్టిన నిరసనకారులు

హాంకాంగ్​: మెట్రో స్టేషన్​కు నిప్పు పెట్టిన నిరసనకారులు

హాం​కాంగ్​లో గత 3 నెలలుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు ముట్టడిని పోలీసులు అడ్డుకోగా ఆగ్రహంతో దగ్గరలోని మాంగ్​కుక్ మెట్రో స్టేషన్​కు పరుగులు తీశారు నిరసనకారులు. అర్ధరాత్రి సమయంలో కొంత మంది ఆందోళనకారులు స్టేషన్​కు నిప్పు అంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఉద్రిక్త పరిస్థితులు

మరి కొంత మంది ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలపై రాళ్లు రువ్వి, పోలీసులపై లేజర్​ లైట్లను ప్రయోగించారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, గ్యాసోలైన్​ బాంబులు, పెప్పర్​ స్ప్రే, వాటర్​గన్​ల​ను ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ ప్రజలు.

ఇదీ చూడండి:కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్​

Last Updated : Sep 29, 2019, 1:17 AM IST

ABOUT THE AUTHOR

...view details