తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2020, 5:48 AM IST

ETV Bharat / international

అఫ్గాన్​ అధ్యక్ష భవనంలో 20 మందికి కరోనా!

ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అఫ్గానిస్థాన్ ప్రెసిడెంట్​ ప్యాలెస్​లోని 20 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే.. అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీకి ఎలాంటి వైరస్​ లక్షణాలు లేవని తెలిపారు.

20 of Afghan president's palace staff have virus: officials
అఫ్గాన్​ అధ్యక్ష భవనంలో 20 మందికి కరోనా!

అఫ్ఘానిస్థాన్​ అధ్యక్ష భవనంలోని 20 మంది సిబ్బందికి కరోనా సోకింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీకి మాత్రం వైరస్​ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 20 మంది కొవిడ్​ బారిన పడడం వల్ల... ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాన్ని మూసివేసినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. ఈ 20 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు పేర్కొన్న ఇంకో అధికారి.. పాలనా విభాగంలోని మరో 12 మందికీ వైరస్​ సోకిందని తెలిపారు.

కరోనా కారణంగా ఇప్పటికే దేశ రాజధాని కాబూల్​ లాక్​డౌన్​లో ఉంది. వైరస్​ వ్యాప్తి తీవ్రమవుతోన్న తరుణంలో ఇటీవలే లాక్​డౌన్​ను మరో 3 వారాలు​ పొడిగించారు.

కొవిడ్​-19 ధాటికి అఫ్ఘాన్​లో ఇప్పటివరకు 33 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 933 మంది ఈ మహమ్మారి బారినపడ్డారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టెస్టులు పరిమితంగా జరుగుతున్నందున.. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details