తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2019, 9:35 AM IST

ETV Bharat / international

ట్విట్టర్:​ అంతరాయంపై వినియోగదారుల ఫిర్యాదు

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ సేవలకు తరచూ అంతరాయం కలుగుతోందని జపనీయులు ఆ సంస్థకి ఫిర్యాదు చేశారు. అయితే అంతరాయానికి గల కారణాలను సంస్థ తెలుపలేదు.

ట్విట్టర్​ అంతరాయంపై వినియోగదారుల ఫిర్యాదు

జపాన్​లో మైక్రోబ్లాగింగ్​ సైట్​ ట్విట్టర్​ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ మేరకు జపాన్​ వినియోగదారులు ఆ​ సంస్థకి ఫిర్యాదు చేశారు. దీనికి స్వందిస్తూ ట్విట్టర్​, ట్వీట్​డెక్​ గల అంతరాయాన్ని తాము ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. సమస్యకు గల కారణాలను వెల్లడించలేదు.

"ప్రస్తుతం అంతరాయానికి గల కారణాలను పరిష్కరిస్తున్నాం, త్వరలోనే సేవలు యథావిధిగా కొనసాగుతాయి. "

-ట్విట్టర్​ సంస్థ

అమెరికా, బ్రిటన్​, భారత్​తో సహా 6 ఖండాల నుంచి దాదాపు 3,200 ఫిర్యాదులు వచ్చిన్నట్లు ట్విట్టర్​ పర్యవేక్షణ సైట్​ తెలిపింది. సగం మందికి పైగా మూడు నెలల నుంచి పూర్తిగా యాప్ పనిచేయట్లేదని​, వెబ్​సైట్​ సేవలుపూర్తిగానిలిచిపోయాయని ఫిర్యాదు చేశారు. కొంతమంది వినియోగదారులు యాప్​ అడపాతడపా పనిచేస్తుందని, దానికి ట్విట్టర్​ డౌన్​ అని హ్యాష్​ట్యాగ్​ జత చేసి పోస్ట్​ చేస్తున్నారు.

ఆగస్టు నెలలోనూ హ్యాకర్​లు ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సి ఖాతాను హ్యాక్​ చేసి వరుసగా జాత్యాహంకార, విద్వేషపూరితమైన ట్వీట్లను పోస్ట్ చేశారు.

ఇదీ చూడండి: అభిశంసన తీర్మానం ఓ తెలివితక్కువ పని: ట్రంప్

ABOUT THE AUTHOR

...view details