అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా ఈనెల 24,25 తేదీల్లో భారత్లో పర్యటిస్తారు. అందుకు సంబంధించి షెడ్యూల్ మొత్తం ఇప్పటికే సిద్ధమైంది. ట్రంప్ ఓ ప్రత్యేక విమానంలో దిల్లీ విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో ఇప్పటకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజాగా దిల్లీ వాతావరణంలో మార్పులు రావడం వల్ల ల్యాండింగ్ ప్రదేశాన్ని మార్చినట్లు సమాచారం. ఒకవేళ దిల్లీలో కాకుంటే రాజస్థాన్లోని జైపుర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుందని తెలిపారు అధికారులు. ఈ మేరకు జైపుర్ విమానాశ్రయంలోనూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికా నుంచి వచ్చిన ముగ్గురు ప్రత్యేక సిబ్బంది బృందం ఆ విమానాశ్రయాన్ని సందర్శించి వసతులను పరిశీలించింది.