కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అమెరికాలో టీకా పంపిణీ ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో తొలి వ్యాక్సిన్ అందించినట్లు ట్వీట్ చేశారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
టీకాను తొలుత ఆరోగ్య సిబ్బందికి అందిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని జెవిష్ మెడికల్ సెంటర్లో పని చేస్తోన్న సాండ్రా లిండ్సే అనే నర్సు టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా 'నేను ఈ రోజు ఎంతో ధైర్యంతో ఉన్నాను' అని పేర్కొన్నారు నర్సు. ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వర్చువల్గా పర్యవేక్షించారు గవర్నర్ ఆండ్రూ క్యూమో.
వ్యాక్సిన్ పొందుతున్న వారిలో తాను ఒకడినని పేర్కొన్నారు ఫైజర్ సీఈఓ ఆల్బెర్ట్ బౌర్లా. సీఈఓ టీకా తీసుకోవటం వల్ల ప్రజలు మరింత నమ్మకంతో ఉంటారని తెలిపారు.