ప్రముఖ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్ ఎక్స్' మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం ముగ్గురు వ్యోమగాములతో సహా ప్రయోగించిన 'స్పేస్ ఎక్స్' వ్యోమనౌక దిగ్విజయంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. కేవలం ఒక్క రోజులో వ్యోమనౌక గమ్యం చేరడం స్పేస్ ఎక్స్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
శనివారం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన టెస్ట్ ఫ్లైట్లో కేవలం డమ్మీ మాత్రమే ఉంది. కానీ ఈ రోజు ప్రయోగించిన వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములను దిగ్విజయంగా పంపగలిగింది. దీంతో అంతరిక్షయానానికి వ్యోమగాములతో కూడిన స్పేస్ క్రాఫ్ట్ పంపడానికి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలించే సమయం వచ్చింది.
ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ప్రయోగాలు విజయవంతమైతే, స్పేస్ ఎక్స్ ఈ వేసవిలోనే ఇద్దరు వ్యోమగాములతో తన మొట్టమొదటి వాణిజ్య వ్యోమనౌకను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. నాసా తలపెట్టిన వాణిజ్య అంతరిక్షయానంలో భాగంగా స్పేస్ ఎక్స్ సంస్థ ఈ వ్యోమనౌకను పంపనుంది. దీనిలోని ఇద్దరు వ్యోమగాముల చర్యలను కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ నుంచి గమనించే అవకాశం ఉంది.
స్పేస్ ఎక్స్ ఇప్పటి వరకు ఎన్నో కార్గో వ్యోమనౌకలను విజయవంతంగా ప్రయోగించింది. కానీ వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానం పూర్తిగా భిన్నమైనది. ఈ వ్యోమనౌక 'స్పేస్ ఎక్స్ అంతరిక్ష కేంద్రం' సహాయం అవసరం లేకుండానే పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుండటం విశేషం.