భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకం. ఈ తొడుగులతో వైరస్ మన దరిచేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్న వేళ.. కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజావసరాల దృష్ట్యా మాస్కుల కొరత ఏర్పడిన నేపథ్యంలో... ఎన్95 మాస్కుల వినియోగంపై తన అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. రోజూ దాదాపు 4 మిలియన్ల తొడుగులను స్టెరిలైజ్(శుభ్రపరచడం) చేయాలని సూచించింది. ఆరోగ్య సేవల సిబ్బంది వీటిని తిరిగి వాడుకోవచ్చని స్పష్టం చేసింది.
''మన దేశంలో కరోనా నుంచి కాపాడేందుకు ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేనివి. వారే నిజమైన హీరోలు. వారికి మెరుగైన సదుపాయాలు అందించడం మన విధి. ఈ నిర్ణయంతో.. మిలియన్ల కొద్దీ మాస్కులు పునఃసృష్టించినట్లవుతుంది. ఫలితంగా కొవిడ్-19 బాధితులకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించేందుకు మరింత దోహదపడుతుంది.''
- ఎఫ్డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్