తెలంగాణ

telangana

ETV Bharat / international

తోటి విద్యార్థులపై బాలుడి కాల్పులు- ముగ్గురు మృతి

అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తోటి విద్యార్థే ఈ కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు అధికారులు.

By

Published : Dec 1, 2021, 3:56 AM IST

Updated : Dec 1, 2021, 6:41 AM IST

school shootings
పాఠశాలలో కాల్పుల

అమెరికా మిచిగాన్ పాఠశాలలో తోటి విద్యార్థులపై 15 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఒక ఉపాధ్యాయుడు సహా మరో ఆరుగురు గాయపడ్డారు. డెట్రాయిట్‌ అనే ప్రాంతంలోని ఆక్స్‌ఫర్డ్ టౌన్‌షిప్‌ హైస్కూల్‌లో ఈ దాడి జరిగింది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని భద్రతాధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు. ఇక ఈ ఉదంతానికి పాల్పడిన విద్యార్థి ఈరోజు స్కూల్​కి రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు.

మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు అత్యవసర ​నెంబర్​ 911కు ఫోన్​కాల్స్ వెల్లువెత్తాయని అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్దనుంచి ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలోకి తుపాకీని ఎలా తీసుకొచ్చాడనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు.

మరోవైపు.. దాడి అనంతరం పాఠశాలలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. భయంతో గదుల్లోకి వెళ్లి దాక్కున్న విద్యార్థులను విడిపించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో పాఠశాలలో ఇతర విద్యార్థులతో గొడవలు జరుగుతున్నాయని తమ కుమారుడు తెలిపినట్లు దాడికి పాల్పడిన బాలుడి తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details