తెలంగాణ

telangana

ETV Bharat / international

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి

భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్​ వంశీయుల ఆభరణాలు, ఆయుధాలను ఈ నెల 19న వేలం వేయనున్నారు. ఇందుకోసం న్యూయార్క్​లోని క్రిస్టీ వేలం భవనంలో వాటిని ప్రదర్శనకు పెట్టారు. వాటిలో హైదరాబాద్​ సంస్థానాన్ని పాలించిన నిజాంల ఆభరణాలూ ఉన్నాయి.

By

Published : Jun 14, 2019, 10:17 PM IST

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి

వేలానికి నిజాం నగలు, షాజహాన్​ కత్తి

అఖండ భారతాన్ని పాలించిన రాజులకు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ. వారి వద్ద ఎన్నోరకాల వజ్రాలతో చేసిన నగలు ఉండేవి.

రాజుల ఆభరణాల్లో చాలా వాటిని సేకరించింది క్రిస్టీ సంస్థ. ప్రస్తుతం వాటిని వేలానికి పెట్టింది. ఈ నెల 19న అమెరికాలోని న్యూయార్క్​లో వేలం వేయనుంది. ఇందుకు సన్నాహకంగా ఆయా ఆభరణాలతో ప్రదర్శన ఏర్పాటుచేసింది. భారతీయ చరిత్రకు అద్దంపట్టేలా ఉన్న ఆభరణాలు, ఆయుధాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రదర్శనలో ఉంచిన వాటిలో హైదరాబాద్​ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజుల ఆభరణాలూ ఉన్నాయి.

"వేలం వేయబోతున్న భారతీయుల అద్భుతమైన అలంకరణ కళ, ఆభరణాలు, చిత్రపటాలు, ఆయుధాలను మనం చూడబోతున్నాం. భారతీయ మొఘల్​ చరిత్రలోని ప్రముఖ రాజులకు చెందిన పలు వస్తువులను చూస్తారు. షాజహాన్​కు చెందిన బాకు (కత్తి), ఉంగరం చూస్తారు. జహంగీర్​కు చెందిన రత్నముూ ఉంది.​"
- విలియమ్​ రాబిన్​సన్​, క్రిస్టీ ప్రతినిధి

తాజ్​మహల్​ నిర్మించిన మొఘల్​ రాజు షాజహాన్​కు చెందిన ఉంగరం, బాకు (కత్తి) ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 19, 20వ శతాబ్దానికి చెందిన సుమారు 380 వరకు నగలు, వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.

ఇదీ చూడండి:పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details