తెలంగాణ

telangana

ETV Bharat / international

కొలంబియా నిరసనల్లో 42కు చేరిన మృతుల సంఖ్య

కొలంబియా నిరసనల్లో ఇప్పటివరకు 42 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ మానవ హక్కుల శాఖ వెల్లడించింది. గత నెల 28 నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి.

By

Published : May 12, 2021, 10:17 AM IST

colombia protests deaths 2021, కొలంబియా నిరసనలు
కొలంబియా నిరసనలు

కొలంబియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వారాలుగా జరుగుతున్న నిరసనల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల శాఖ మంగళవారం వెల్లడించింది. నిరసనకారుల్లో 168 మంది ఆచూకీ గల్లంతైందని పేర్కొంది.

నిరసన తెలుపుతున్న ప్రజలు
నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రభుత్వం పన్ను పెంచడాన్ని నిరసిస్తూ ప్రజలు గత నెల 28 నుంచి ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసనలకు స్పందించిన ప్రభుత్వం.. ప్రతిపాదించిన 6.7 బిలియన్​ డాలర్ల ప్రణాళికను మే2న ఉపసంహరించుకుంది. కానీ నిరసనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. పోలీస్​ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని, కోటి మందికి కనీస వేతన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు పలు మార్లు ప్రభుత్వంతో నిరసనకారులు చర్చలు జరిపినా.. సానుకూల ఫలితాలు అందలేదని సమాచారం.

ఇదీ చదవండి :తప్పుడు లెక్కే భారత్‌ కొంప ముంచింది: ఫౌచీ

ABOUT THE AUTHOR

...view details