తెలంగాణ

telangana

By

Published : May 18, 2019, 4:33 PM IST

Updated : May 18, 2019, 4:57 PM IST

ETV Bharat / elections

'సార్వత్రికం' తుది దశకు సర్వం సిద్ధం

సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. చివరిదైన ఏడో విడతలో 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ దశ ఎన్నికలే ఫలితాలను శాసిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల భారతం

'సార్వత్రికం' తుది దశకు సర్వం సిద్ధం

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఓటింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు

కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు

భాజపాకు కీలకం

చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ. బంగాల్​ మినహా మిగతావన్నీ హిందీ రాష్ట్రాలే కావటం విశేషం.

ప్రముఖ స్థానాలు

  1. వారణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్రమోదీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ తరఫున అజయ్​ రాయ్​, ఎస్పీ తరఫున షాలినీ యాదవ్​ బరిలో ఉన్నారు.
  2. పాటలీపుత్ర (బిహార్​): ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమార్తె మిశా భారతి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి లాలూ మాజీ సన్నిహితుడు, కేంద్రమంత్రి రామ్​ కృపాల్​ యాదవ్​ బరిలో ఉన్నారు.
  3. పట్నా సాహిబ్ (బిహార్​): ఒకప్పటి సహచరులు ప్రత్యర్థులుగా మారారు. కేంద్ర మంత్రి రవిశంకర్​ప్రసాద్​, సిట్టింగ్​ ఎంపీ, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా మధ్య పోటీ ఆసక్తికరం.
  4. గురుదాస్​పుర్ (పంజాబ్​)​: రాష్ట్రంలో భాజపా ఆశలు పెట్టుకున్నది సన్నీ దేఓల్​పైనే. ప్రత్యర్థిగా కాంగ్రెస్​ నుంచి సునీల్​ కుమార్​ జాఖర్​ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

పంజాబ్​లో శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​, ఇద్దరు కేంద్రమంత్రులు హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, హర్​దీప్​ సింగ్​ పురి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

Last Updated : May 18, 2019, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details