ఏపీలోని విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ ఓ గిరిజనుడిని హతమార్చారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన కొర్రా పిల్కు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి పోలీసులు ముందు లొంగిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధులైన సుమారు 20 మంది మావోయిస్టులు పిల్కు ఇంటిపై దాడి చేశారు. పిల్కుపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడి హత్య చేశారు. అడ్డుకోబోయిన పిల్కు భార్య మిత్తుపైనా దాడి చేయగా..ఆమె తీవ్రంగా గాయపడింది.
పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి దారుణ హత్య
పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ ఏపీలోని విశాఖ మన్యంలో ఓ గిరిజనుడిని మావోలు దారుణంగా హతమార్చారు. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన పిల్కు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు.
పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి దారుణ హత్య
పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నందుకే పిల్కును హతమార్చామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖను విడిచి వెళ్లారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరగటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: ట్రాక్టర్ బీభత్సం... నలుగురికి గాయాలు