తెలంగాణ

telangana

Road Accident In AP : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

By

Published : Dec 26, 2021, 8:13 AM IST

ఏపీలోని నెల్లూరు జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురు యవకులు మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Road Accident In AP
Road Accident In AP

Road Accident In Nellore District : ఏపీలోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం బండేపల్లి వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురు యవకులు మృతి చెందారు. వీరంతా డక్కిలి మండలానికి చెందిన వేర్వేరు గ్రామాలకు చెందినవారు. ప్రమాద స్థలంలో ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లింగసముద్రం నివాసి గోనుగొడుగు ఉదయ్‌ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సంగనపల్లికి చెందిన పరుచూరి సునీల్‌ (26) రాపూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేసరికి మృతిచెందారు. వెలికల్లుకు చెందిన శ్రీనివాసులు (28)ను మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బంధువుల రోదనలు..

Nellore Road Accident : సంగనపల్లికి చెందిన చంద్రమౌళి కుమారుడు సునీల్‌కు రెండేళ్ల కిందటే వివాహం అయింది. ఆయనకు ఏడాది కుమారుడు ఉన్నారు. సునీల్‌కు సమీప బంధువు అయిన వెలికల్లుకు చెందిన శ్రీనివాసులుతో కలిసి రాపూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన సంజీవయ్య రమణమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉదయ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉదయ్‌ పొక్లయినర్‌ ఆపరేటర్‌గా, వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ప్రమాదంలో ఏకైక కుమారుడు మృత్యువాతపడడంతో ఈ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. స్థానికులు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండిAdilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details