తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2021, 7:30 PM IST

ETV Bharat / crime

Mother arrest: కుమారున్ని కొట్టి చంపిన కేసులో తల్లి అరెస్ట్

జీడిమెట్ల పరిధిలో మంగళవారం జరిగిన బాలుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భర్తపై కోపంతోనే తన కుమారుడిని ప్రియుడితో కలిసి కొట్టి చంపినట్లు నిందితురాలు ఉదయ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Police arrested the accused who allegedly stabbed his son
ప్రియుడితో కలిసి కుమారున్ని చంపిన తల్లి

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలోని... భగత్​సింగ్​నగర్‌లో కుమారున్ని కన్న తల్లే కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి ఉదయతో పాటు ఆమె ప్రియుడు భాస్కర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వివాహేత సంబంధానికి అడ్డు వస్తున్నాడని కొట్టి చంపినట్లు ఒప్పుకుందని చెప్పారు. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్​కు... ఉదయతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఉమేష్‌ అనే కుమారుడు ఉన్నాడు. భాస్కర్ అనే మేస్త్రీ వద్ద సురేష్​ పనికి వెళ్తుండేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో భాస్కర్​తో ఉదయ సాన్నిహిత్యంగా మెలిగేది. గమనించిన భర్త... పలుమార్లు హెచ్చరించాడు.

కుమారున్ని కొట్టిచంపిన ఉదయ
ఉదయ ప్రియుడు భాస్కర్‌

కొన్ని రోజులకు కుమారుడు ఉమేష్(3)ను తీసుకుని భాస్కర్​తో కలిసి వెళ్లిపోయింది. కుమారునితో కలిసి రెండేళ్లుగా భగత్​సింగ్​నగర్​లో ఉదయ నివాసముంటోంది. తన కుమారుడిని చూడడానికి పలుమార్లు సురేష్... జగద్గిరిగుట్ట నుంచి భగత్​సింగ్​నగర్​కు వచ్చేవాడు. కుమారుని కారణంగా సురేష్ పదే పదే తన ఇంటికి వస్తున్నాడన్న కోపంతో పిల్లాడిని కర్రతో తీవ్రంగా కొట్టింది. దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయిన బాలున్ని... పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చివరకు సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కన్నతల్లి కర్కశత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం

ABOUT THE AUTHOR

...view details