తెలంగాణ

telangana

ETV Bharat / crime

విధి నిర్వహణలో అమరుడైన జవానుకు కన్నీటి వీడ్కోలు

విధి నిర్వహణలో గాయపడి అమరుడైన నిజామాబాద్​ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపుర్ వాసి కల్యాణ్​రావు అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు​.. జవాను మృతదేహానికి ఘన నివాళులర్పించారు.

By

Published : Jun 18, 2021, 10:37 PM IST

Updated : Jun 19, 2021, 7:16 AM IST

tributes to the deceased Jawan
tributes to the deceased Jawan

విధి నిర్వహణలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్​ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపుర్​ గ్రామానికి చెందిన జవాను కల్యాణ్​రావు అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు.. జవాను భౌతిక కాయానికి నివాళులర్పించారు. గ్రామస్థులు.. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు.

సాంకేతిక విభాగంలో విధులు నిర్వహించే కల్యాణ్​రావు.. ఈనెల 15న చెట్టుపై కేబుల్ తీగలను సరిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలై.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి:Cabinet: లాక్​డౌన్​పై రేపు నిర్ణయం తీసుకోనున్న కేబినెట్​

Last Updated : Jun 19, 2021, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details