IT RAIDS AT YCP LEADERS HOUSES: ఆంధ్రప్రదేశ్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఈ రోజు విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినాష్ ఇంట్లో ఉదయం 6.30 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇళ్లలో ఐటీ దాడులు
IT RAIDS AT YCP LEADERS HOUSES: తెలుగు రాష్ట్రాలలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈరోజు ఏపీలోని వైసీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విజయవాడలో సోదాలు నిర్వహించారు. వైసీపీ నేత అవినాష్ ఇంటిలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
IT RAIDS AT YCP LEADERS HOUSES
మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వంశీరామ్ బిల్డర్స్ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కి పైగా బృందాలు పాల్గొంటున్నాయి.
ఇవీ చదవండి:
Last Updated : Dec 6, 2022, 4:11 PM IST