తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2022, 12:08 PM IST

ETV Bharat / crime

పసివాడి ప్రాణం తీసిన భార్యాభర్తల వివాదం.. గోడకేసి బాదడంతో..!

Father Killed 3 Months Baby: భార్యభర్తల వివాదం.. ముక్కుపచ్చలారని ఓ 3 నెలల పసికందు ప్రాణం తీసింది. భర్త క్షణికావేశం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

murder
murder

Father Killed 3 Months Baby: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. 3 నెలల పసికందును కన్న తండ్రి హతమార్చాడు. పట్టణానికి సమీపంలోని వేడాం మిట్ట కండ్రిగకు చెందిన మునిరాజ అలియాస్ (అనిల్), స్వాతిలకు ఏడాది కిందట వివాహం జరిగింది. జీవనాధారం కోసం పట్టణానికి చేరుకుని.. వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల కుమారుడు నిఖిల్​ ఉన్నాడు.

భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంతో క్షణికావేశంలో భర్త పసికందును గోడకేసి బాదాడు. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుమారుడి మృతితో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిరాజను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details