తెలంగాణ

telangana

నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

By

Published : May 7, 2021, 7:32 AM IST

హైదరాబాద్, పాతబస్తీలో ఓ కుటుంబం అదృశ్యం కలకలం రేపుతోంది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ భార్య తన నలుగురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది.

family went missing
family went missing

నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పీస్​ పరిధిలో చోటుచేసుకుంది. రఫీ అనే ఓ ఆటో డ్రైవర్.. భార్య తన నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ నెల 4వ తేదీన.. రఫీ తన సోదరుడిని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో వదిలేసి, 5వ తేదీ సాయంత్రం తిరిగి వచ్చేశాడు. ఇంట్లో.. భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. బంధువులను అడిగినా.. చుట్టు పక్కల వెతికినా లాభం లేకపోవడంతో 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:మోతె శివారులో యువకుడి హత్య

ABOUT THE AUTHOR

...view details