తెలంగాణ

telangana

అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన గర్భిణీ

By

Published : May 12, 2021, 6:21 PM IST

ఎనిమిది నెలల గర్భిణీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దయ్యంబండలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

yadadri bhuvanagiri, crime
అనుమానాస్పదస్థితిలో గర్భిణీ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దయ్యంబండలో ఎనిమిది నెలల గర్భిణీ అయిన వాకుడోతు సబిత(22) అనుమానాస్పదంగా మృతి చెందింది. అత్తింటి వారే తమ కుమార్తెను చంపి ఉరి వేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సబిత మరణించిన సమయం నుంచి అత్త, మామ, భర్త అక్కడ లేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:దా'రుణ' యాప్​ కేసులో రూ.76 కోట్ల ఆస్తులు సీజ్

ABOUT THE AUTHOR

...view details