తెలంగాణ

telangana

ETV Bharat / crime

25 లక్షలు ఫట్​.. ఇంట్లోంచి ఎస్కేప్

ఓ యువకుడు జూదానికి అలవాటు పడ్డాడు..డబ్బులు రావడం, పోవడం క్రమంగా జరుగుతోంది. ఈ క్రమంలో కొంత మేర డబ్బులు పోయాయి. మళ్లీ వాటిని ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో.. పెద్ద మొత్తంలో 25 లక్షల రూపాయల డబ్బులు పెట్టి అవి సైతం పోగుట్టుకున్నాడు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పకుండా అతడు లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

By

Published : Mar 9, 2021, 2:07 AM IST

Updated : Mar 9, 2021, 2:13 AM IST

25 lakhs in gambling a person escape from home at medchal area
25 లక్షలు ఫట్​.. ఇంట్లోంచి ఎస్కేప్

ఓ జూదంలో 25 లక్షలు పోగొట్టుకున్నానని ఓ యువకుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి న్యూ మిర్జాలగూడలో నిఖిల్(24)అనే యువకుడు ఉండేవాడు.

వ్యసనంగా మారిన జూదంలో డబ్బులు పోగొట్టుకున్నానని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పకుండా లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తండ్రి బర్ల చంద్రమౌళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు

Last Updated : Mar 9, 2021, 2:13 AM IST

ABOUT THE AUTHOR

...view details