నిజామాబాద్ జిల్లా బోధన్లో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులకు అగ్నిప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకుంటున్న అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించి... అగ్నిప్రమాద సమయంలో వీటిని పాటిస్తామని హామీ ఇచ్చారు.