తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2021, 11:02 PM IST

ETV Bharat / city

మంత్రి పువ్వాడ వినూత్న నిర్ణయం.. నగరంలో బైక్​పైనే పర్యటన

మంత్రి వస్తున్నారంటే... హడావుడి మామూలుగా ఉండదు. కాన్వాయిలో భారీగా వాహనాలుంటాయి. ఎక్కడికక్కడ వాహనాలను ఆపేస్తారు. కానీ ఖమ్మంలో ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. నగరంలో బైక్​పైనే పర్యటించాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ నిర్ణయించుకున్నారు.

మంత్రి పువ్వాడ వినూత్న నిర్ణయం.. నగరంలో బైక్​పైనే పర్యటన
మంత్రి పువ్వాడ వినూత్న నిర్ణయం.. నగరంలో బైక్​పైనే పర్యటన

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​... రోడ్డు భత్రత వారోత్సవాల సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నగరంలో బైక్​పైనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అందుకోసం ఓ బుల్లెట్ వాహనాన్ని కొనుకున్నారు.

ఎస్కర్టు వారు కూడా ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రి వెంట తిరిగే నాయకులు బైక్​లు సమకూర్చుకోవాలన్నారు. జడ్పీ ఛైర్మన్​ లింగాల కమల్​రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు మంత్రి సొంత ఖర్చులతో కొనిస్తానని ప్రకటించారు. ఇవాళ నగరంలో బైక్​పైనే ర్యాలీ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'నినాదాలు, ప్రసంగాలతో దేశాభివృద్ధి సాధ్యం కాదు'

ABOUT THE AUTHOR

...view details