తెలంగాణ

telangana

రథసప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు

By

Published : Feb 16, 2021, 5:15 PM IST

ఈ నెల 19న రథసప్తమి నేపథ్యంలో శ్రీవారి సర్వ దర్శనానికి నేటి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నట్లు తితిదే తెలిపింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించింది.

ttd-has-announced-ratha-saptami-tokens-will-be-issued-from-today
రథసప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు

రథ సప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లను... నేటి నుంచే జారీ చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. శ్రీ‌వారి ద‌ర్శనం కోసం రోజుకు 20వేల చొప్పున టైంస్లాట్ సర్వదర్శనం టికెట్లను తితిదే జారీ చేస్తోంది. కరోనా కారణంగా రథ సప్తమిరోజున వాహనసేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details