1. కేటీఆర్ సీరియస్..
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భాజపా తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అభినందనలు
మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ బోయిన్పల్లి మార్కెట్ గురించి ప్రస్తావించి అభినందనలు తెలపడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పల్స్ పోలియో..
రాష్ట్రవ్యాప్తంగా 'పల్స్ పోలియో' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తొలిచుక్కలు వేసి.. కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో 23 వేలకు పైగా కేంద్రాల్లో... ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరోనా కారణంగా గతంలో దీనిని వాయిదా వేసిన ప్రభుత్వం... తీవ్రత తగ్గటంతో తిరిగి ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, వైద్యారోగ్య సిబ్బంది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించటంతో తొలిదశలో విజయవంతంగా ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఫిబ్రవరి 13 వరకే రాజ్యసభ!
రాజ్యసభ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న సభా కార్యకలాపాలు కొనసాగుతాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. అదే రోజు సభ కార్యకలాపాలు ముగుస్తాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తోమర్ కౌంటర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుపట్టారు. మూడు చట్టాల వల్ల రైతులకు కలిగే లాభాలను అనుభవజ్ఞులైన పవార్ వివరించాలని హితపు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.