తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 9:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM

  • ఎలా ముందుకెళ్దాం..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రప్రభుత్వం గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తదితరులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోట్లు కురిపించిన ఖానామెట్​ భూములు..

హైదరాబాద్​ ఖానామెట్‌ భూముల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 14.91 ఎకరాల భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూర్చాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షర్మిలకు కౌంటర్​ ఇచ్చిన రేవంత్​ రెడ్డి..

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల.. తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆమె కుటుంబంలో సమస్యలున్నాయని.. అన్న ఆదరణ కరవైందని.. అన్న మీద కోపం తమమీద ఎందుకు చూపించాలంటూ.. సెటైర్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేటాయింపుల ప్రకారమే నీటి పంపిణీ..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 715 కరోనా కేసులు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,13,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 715 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్​తో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో కరోనా..

జులై 15 చివరివారంలో దేశంలోని 47 జిల్లాల్లో పది శాతం కొవిడ్ పాజిటివిటీ రేటు నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్​ నిబంధనలను విస్మరిస్తే పరిస్థితులు చేజారిపోతాయని హెచ్చరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైకో లవర్​..

ప్రియురాలితో బ్రేకప్ అయితే కొందరు మందేస్తారు. మరికొందరు బాధతో కుంగిపోతారు. కానీ, బెంగళూరులో ఓ ప్రేమికుడు సైకోలా ప్రవర్తించాడు. అతడు ఏం చేశాడంటే... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదరగొట్టిన జొమాటో..

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో(Zomato IPO) ఇనీషియల్​ పబ్లీక్​ ఆఫర్​ (ఐపీఓ)కు భారీ స్పందన దక్కింది. ఈనెల 14న మొదలై 16తో ఐపీఓ ముగియగా.. 38 రెట్లు అధిక సబ్​స్క్రిప్షన్​లు సాధించింది. ఇష్యూలో భాగంగా ఆ సంస్థ 71.92 కోట్ల షేర్లు విక్రయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​తో సిరీస్​కు లంక స్క్వాడ్​ ఇదే..

టీమ్ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది లంక బోర్డు(IND vs SL). దసున్​ శనక(Dasun Shanaka) నేత్వత్వంలోని 23 మంది స్క్వాడ్​ను వెల్లడించింది. జులై 18 నుంచి ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిధి అగర్వాల్ వార్నింగ్..

నటి నిధి అగర్వాల్ నెటిజన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 'అలాంటి ఫొటోలు షేర్ చేయకండి' అంటూ మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details