- సీఎం సమీక్ష..
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితి, లాక్డౌన్ అమలు తీరుపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '18 ప్లస్'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్!
18 నుంచి 44 ఏళ్లవారికి కొవిడ్ టీకా కోసం.. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే కొవిన్ పోర్టల్లో నమోదుకు అనుమతిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మెల్యే తమ్ముడినంటూ హంగామా..!
పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులకు.. ఓ వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా.. చర్లబుత్కూర్ గ్రామం వైపు నుంచి వస్తోన్న ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి వర్షసూచన..
రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ సంచాలకులు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం..
హైదరాబాద్ మంగళ్హాట్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో గ్యాస్ పైప్ లైన్ లీక్..