- కేబినెట్ భేటీ ప్రారంభం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం దీపావళి శుభాకాంక్షలు..
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని ముఖ్యమంత్రి వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుడిలోకి ప్రవేశంలేదు..
ఆధునిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలోనూ... కులాల వారిగా నిబంధనలు పెడుతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో సైతం... కొన్ని కులాల వారిని ఆలయాల్లో ప్రవేశించరాదని ఆపేస్తున్నారు. ఫలానా కులం వారికి దేవాలయాల్లో పూజలు చేయమని నిరాకరిస్తూ... వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ అమానవీయ ఘటన జనగామలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అత్యాధునిక బస్షెల్టర్లు..
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో నూతనంగా నిర్మించిన ఆరు ఆధునిక బస్షెల్టర్లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. హైదరాబాద్లో అత్యాధునిక హంగులతో వెయ్యి బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. అత్యాధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా... ప్రముఖ నగరాల్లో మాదిరిగా హైదరాబాదీలకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతోందని మేయర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 6 రాష్ట్రాలకు విపత్తు సాయం..
ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన ఆరు రాష్ట్రాలకు సాయం కింద త్వరలోనే రూ.4,382 కోట్లు విడుదల చేయనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో బంగాల్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాకిస్థాన్ కాల్పుల్లో ఎస్సై మృతి..