- సీఎం భేటీ..
దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉపసభాపతి పద్మారావుగౌడ్, తెరాస ప్రధాన కార్యదర్శులతో సీఎం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమికి కారణాలపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రఘునందన్రావు పిటిషన్..
దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై భాజపా అభ్యర్థి రఘునందన్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇంట్లో రూ.18 లక్షలు లభించాయని కట్టుకథ అల్లారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్నికల కమిషనర్ సమావేశం..
రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించారు. ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ వద్ద ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది..
దుబ్బాక ప్రజలు తెరాసకు కర్రు కాల్చి వాత పెట్టారని... భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బిహార్, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు విపక్షాలకు చెంపపెట్టు లాంటివన్నారు. మోదీపై విమర్శలు మానుకొని... కాంగ్రెస్ తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎంగా నితీశ్ ప్రమాణం ఎప్పుడంటే..!