- మార్కెట్లకు కొత్త 'జో'రు..
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు బలపడి జీవన కాల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో తాజా గరిష్ఠాలను నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రంగు మారిన ధాన్యాన్నీ కొంటాం..
రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రైస్ మిల్లర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రి కన్నీళ్లు..
జవాన్ మహేష్ మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని... ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీ సభ్యులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం..
విపత్తులు సంభవించినప్పుడు ఏంచేయాలో ప్రధాని మోదీ చూసి నేర్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కేటీఆర్కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గంపగుత్తగా రాజీనామా చేస్తామంటే కేంద్రం.. రాష్ట్రానికి అదనంగా ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమని అర్వింద్ సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం..
హైదరాబాద్లో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. జవహర్నగర్లో నిర్మించిన ప్లాంటును మంగళవారం... మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జేఎన్టీయూలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం..