- దేశంలో కొత్త కరోనా కేసులు..
దేశంలో కొత్తగా 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. 59,384 మంది కోలుకోగా 853 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గురువారం 42,64,123 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిటీలో హైటెక్ వ్యభిచారం..
నగరంలో హై‘టెక్’ వ్యభిచారం నడుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా దందా నడిపిస్తున్నారు. ‘యాప్’ల ద్వారా వలపు వల విసురుతూ చీకటి దందా కొనసాగిస్తున్నారు. విదేశాల నుంచి మహిళలను తీసుకొచ్చి ‘డిమాండ్’ను సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లల్లో మూడో ముప్పు తక్కువే
మూడో దశ కరోనా ముప్పు(Corona Third Wave) భారత్లో తక్కువగా ఉంటుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పిల్లల్లో థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలుడిపైకి దూసుకెళ్లిన కారు..
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని... ప్రేమావతిపేటలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్... ఇంటి ముందు కూర్చున్న బాలుడిని ఢీకొట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైబరాబాద్ పోలీసుల వ్యవహారం వైరల్
సైబరాబాద్ పోలీసుల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతోంది. నిన్నటికి నిన్న ఇన్స్పెక్టర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ అదే స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ రాసిన లేఖ వైరల్ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకాతో తలెత్తే రక్తపు గడ్డలకు చికిత్స