విజయవాడలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచేశారు. బంగారు దుకాణం వాచ్మెన్ను బంధించి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వాచ్మెన్ను ఆసుపత్రికి తరలించారు.
వాచ్మెన్ను కట్టేసి.. రూ.4 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
ఏపీలోని విజయవాడ కాటూరివారి వీధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. ఓ నగల దుకాణం వాచ్మెన్ను కట్టేసి.. నాలుగు కోట్ల విలువైన నగలు, కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ఐదు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
వాచ్మెన్ను కట్టేసి.. రూ.4 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.