తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌ ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహం

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వరుస ఘటనలు చోటు చేసుకోవటంపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

By

Published : May 2, 2022, 10:27 PM IST

AP Government
ఏపీ ప్రభుత్వం

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వరుస ఘటనలు చోటు చేసుకోవటంపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 42 మంది టీచర్లు అరెస్ట్ కాగా.. వారందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా మాల్ ప్రాక్టీస్ వ్యవహరాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్దమవుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని యోచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details