తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2020, 8:03 AM IST

ETV Bharat / city

కరోనా బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం: అల్లం

రాష్ట్రంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రెస్ అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందించినట్టు ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పడి వరకు 442 మందికి రూ.82 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఉంటే వివరాలు పంపాలని సూచించారు.

telangana press academy financial support to corona effected journalists
కరోనా బాదిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం: అల్లం

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోన వైరస్ బారిన పడిన 442 మంది జర్నలిస్టులకు రూ. 82 లక్షల ఆర్థిక సహాయం అందించినట్టు... తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 368మందికి రూ.20 వేల చొప్పున... 73 లక్షల 60 వేల రూపాయలు, హోం క్వారంటైన్​లో ఉన్న 84 మందికి రూ.10 వేల 8 లక్షల 40 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. కరోనా బారిన పడి జర్నలిస్టులు... ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించి పత్రంతోపాటు తమ వివరాలు... తెలంగాణ రాష్ట్ర మీడియా ఛైర్మెన్ వాట్సప్ నెంబర్​ 8096677444 కు పంపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details