Swachh Autos Distribution : ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో హైదరాబాద్ను స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో మరో 1350 స్వచ్ఛ ఆటోల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్లో ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసానితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్లో చెత్త సేకరణ ఎంతగానే మెరుగుపడిందన్న కేటీఆర్... అందుకు సహకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు..
Minister KTR News Today : "సఫాయి అన్నా.. నీకు సలామ్ అన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వడమే కాదు వారికి గౌరవ ప్రదమైన వేతనం అందించిన ఘనత కేసీఆర్దే. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి.. తడి, పొడి చెత్త వేరుచేసి డంప్యార్డుకు తరలిస్తున్నారు. నగరంలో 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం."