తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం - telangan governament take precautions

కరోనా వైరస్​ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టి... పరీక్షలు చేసి పంపిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. నగరంలో అనుమానితుల శాంపిళ్లు వైరాలజీ ల్యాబ్​కు పంపించారు.

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం
కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం

By

Published : Jan 27, 2020, 10:17 PM IST

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి... వైద్య పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా... నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 30 పడకలతో ఏడో వార్డు(ఐసోలేషన్​)ను 'కరోనా' అనుమానితుల కోసం సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్​ కె. శంకర్ తెలిపారు.

నగరంలో ఐదుగురికి కరోనా వైరస్​ సోకినట్లు అనుమానంతో... ముగ్గురి నుంచి శాంపిళ్లు సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించారు. ఇద్దరికి సంబంధించి నెగిటివ్​ వచ్చింది. వారిద్దరిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మరొకరి రిపోర్టు రావాల్సి ఉంది. అప్పటి వరకు వారిని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన కమిటీ సభ్యులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫీవర్​, గాంధీ ఆసుపత్రిని సందర్శించి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం జరగనుంది.

కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం

ఇదీ చూడండి: కరోనా కలకలం... హైదరాబాద్​లో కేంద్ర వైద్య బృందం

ABOUT THE AUTHOR

...view details