ETV Bharat / state

కరోనా కలకలం... హైదరాబాద్​లో కేంద్ర వైద్య బృందం

author img

By

Published : Jan 27, 2020, 5:51 PM IST

హైదరాబాద్​లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేంద్ర వైద్య బృందం నగరంలోని ఫీవర్, గాంధీ ఆస్పత్రుల్లో పర్యటించింది.

karona virus
కరోనా కలకలంతో... హైదరాబాద్​లో కేంద్ర వైద్య బృందం

హైదరాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. చైనాతో పాటు ఇతర దేశాలనూ వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్​లో కలకలం రేపడం వల్ల ఫీవర్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. కరోనా అనుమానితులకు చికిత్స, చేపట్టిన చర్యలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనేదానిపై వైద్యులకు పలు సూచనలు చేశారు.

హైదరాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. చైనాతో పాటు ఇతర దేశాలనూ వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్​లో కలకలం రేపడం వల్ల ఫీవర్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. కరోనా అనుమానితులకు చికిత్స, చేపట్టిన చర్యలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనేదానిపై వైద్యులకు పలు సూచనలు చేశారు.

ఇవీ చూడండి: కాశీం అరెస్టుపై పోలీసుల కౌంటర్ దాఖలు​.. శుక్రవారం వాదనలు

TG_Hyd_41_27_Corona_Virus_In_hyd_AV_TS10121 Contributor: Vijender Camera: N Ramesh Script: Razaq Note: రోగుల పేర్లు ఉన్నాయి..గమనించి అవసరమైతేనే పేర్లను వాడుకోగలరు. ( ) చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే చైనాలో పెద్ద సంఖ్యలో ఈ వైరస్‌ సోకింది. పలు దేశాల్లో కూడా కరోనా వైరస్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మొన్నటి వరకు స్వైన్‌ఫ్లూతో భయపడ్డ హైదరాబాద్‌ నగరం ప్రజలు ఇప్పుడు కరోనా వైరస్‌తో వణుకుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ మహానరగంలో కూడా నలుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు సోకినట్లుగా డాక్టర్లు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులు ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నలుగురు వ్యక్తులను ఫీవర్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డ్ (ఐసోలేషన్ వార్డ్)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురిలోని ఇద్దరి రక్త నమునాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఫీవర్‌ ఆస్పత్రిలో చేరిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు చైనా నుంచి ఇటీవలే వచ్చారు. కాగా ఇద్దరి రక్త నమూనాలోను నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని ఫీవర్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్‌ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేషన్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేసి చికిత్స చేస్తున్నారు. జూబ్లిహిల్స్‌కు చెందిన నాగార్జునరెడ్డి కుమారుడు అమర్‌నాథ్‌ రెడ్డి(25) ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురై అతను శనివారం రాత్రి ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేషన్ వార్డులో ఆయన్ను ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో 3 అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఐసోలేషన్ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికంటే ముందు గత పది రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విద్యార్థి దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యాడు. కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఆ విద్యార్థి ఫీవర్‌ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షల్లో సాధారణ ఫ్లూగా తేలింది. అతడికి చికిత్స చేసి ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి ఒక కమిటీ దీనిపై ఇలవాళ ఫీవర్‌ ఆస్పత్రిలో విచారణ జరిపింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.