రైలు కూత ఆగింది.. పూట గడవడం కష్టమవుతోంది
స్టేషన్లోకి రైలు వచ్చిందంటే.. వాళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. ప్రయాణికుడు రైలు దిగగానే.. కూలీ.. కూలీ అనే మాటలే ఎక్కువ వినబడతాయి.. అలాంటిది రైలు కూత ఆగి సుమారు 40 రోజులు గడిచింది. దానినే నమ్ముకొని ఇన్నాళ్లు జీవించిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడ పనిదొరుకుతుందా.. ఎవరైనా ఆసరా ఇస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరో పని దొరక్క.. కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్నామంటున్న రైల్వే కూలీల దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి రిపోర్ట్...
రైలు కూత ఆగింది.. పూట గడవడం కష్టమవుతోంది