తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్యాంకుల వద్ద జనం బారులు.. మాయమైన భౌతిక దూరం - rush at hyderabad suraram sbi bank

ప్రభుత్వం రేషన్​ కార్డుదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1500 తీసుకోవడానికి వికారాబాద్ జిల్లా​ సూరారంలో బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరారు. అధికారులు టోకెన్లు ఇచ్చినప్పటికీ వారు భౌతిక దూరం పాటించకపోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

no social distancing by people at suraram bi bank
బ్యాంకుల వద్ద జనం బారులు.. మాయమైన భౌతిక దూరం

By

Published : Apr 16, 2020, 11:06 AM IST

Updated : Apr 16, 2020, 5:31 PM IST

రేషన్‌ కార్డుదారుల ఖాతాల్లో ప్రభుత్వం 1500 రూపాయల నగదు జమ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు... ఆ డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా​ సూరారంలో బ్యాంకుకు వచ్చినవారికి టోకెన్లు ఇచ్చినప్పటికీ... భౌతిక దూరం పాటించకుండా లైనులో నిలబడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన డబ్బులు వెంటనే తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయనే అపోహతో అందరూ ఒకేసారి వచ్చారు. ప్రజలు గుంపులుగుంపులుగా బ్యాంకు వద్దకు చేరుకోవడం వల్ల వారిని అదుపుచేయడం బ్యాంకు అధికారులకు, పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

Last Updated : Apr 16, 2020, 5:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details